బెజ్జంకి, ఆగస్టు 18 (ప్రజావాణి)
సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో 6వ తరగతి చదువుతున్న ఓ బాలిక ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
హాస్టల్లో ఉండడం ఇష్టం లేక పాఠశాల భవనంపై నుంచి దూకినట్లు సమాచారం. వెంటనే బాలికను 108 అంబులెన్స్లో ఆస్పత్రికి తరలించారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్లోని నిమ్స్ ఆస్పత్రికి తరలించినట్లు తెలిసింది.
ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.