prajavaani.net
Newspaper Banner
Date of Publish : 15 August 2026, 3:02 pm Digital Edition : MADHUBABU ANDRAPRADESH

బద్వేలు గాంధీ నగర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

బద్వేలు ఆగస్టు15ప్రజావాణి పట్టణంలోని గాంధీనగర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను వైద్యాధికారి డాక్టర్ పి. శరత్ చంద్ర ఆధ్వర్యంలో శనివారం ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డిప్యూటీ డీహెచ్‌ఓ డాక్టర్ వి. మల్లేష్ హాజరయ్యారు.ఈ సందర్భంగా డాక్టర్ పి. శరత్ చంద్ర మాట్లాడుతూ ప్రతి ఒక్కరిలో దేశభక్తి భావం పెంపొందాలని ఆకాంక్షించారు.ప్రభుత్వ ఉద్యోగులు తమ విధులను బాధ్యతాయుతంగా నిర్వర్తిస్తూ ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని సూచించారు. ఉద్యోగుల సేవల ద్వారా తమ శాఖకు, రాష్ట్రానికి, దేశానికి మంచి పేరు తీసుకురావాలని పిలుపునిచ్చారు.కార్యక్రమంలో హెల్త్ సూపర్‌వైజర్ వి. శివరామిరెడ్డి,యూపీహెచ్‌సీ గాంధీనగర్ సిబ్బంది,హెల్త్ అసిస్టెంట్ కే,వెంకటసుబ్బయ్య, ఏఎన్‌ఎంలు, ఆశా కార్యకర్తలు,ఆరోగ్య కేంద్ర సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.