నూతన సీఐ ని మర్యాదపూర్వకంగా కలిసిన టేకుమట్ల కాంగ్రెస్ పార్టీ నాయకులు
ప్రజావాణి/టేకుమట్ల :చిట్యాల సర్కిల్ పరిధిలోనూతనంగా బాధ్యతలు స్వీకరించిన సీఐ ఎడ్లపల్లి సతీష్ టేకుమట్ల మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తిప్పిరెడ్డి క్రిష్ణా రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు.ఈ సందర్భంగా సీఐ సతీష్ శాలువా కప్పి, పుష్పగుచ్ఛం అందించి శుభాకాంక్షలు తెలియజేశారు శాంతిభద్రతల పరిరక్షణ, ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉంటూ పోలీసు శాఖ అందించే సేవలకు తమవంతు పూర్తి సహకారం ఉంటుందని ఈ సందర్భంగా పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో టేకుమట్ల మండల సర్పంచులు నాంపెల్లి వీరేశం, బొడ్డు తిరుపతి, నేరెళ్ల రామకృష్ణ, పేరుమాండ్ల చంద్రకళ, మొగిలి, కుర్రె మల్లయ్య,...