prajavaani.net
Newspaper Banner
Date of Publish : 16 August 2026, 12:43 pm Digital Edition : RAJASHEKARREDDY

నూతన పీఏసీఎస్ చైర్మన్‌ ని ఘనంగా సన్మానించిన యువజన నాయకులు

బెజ్జంకి, ఆగస్టు 16 (ప్రజావాణి)

బెజ్జంకి పీఏసీఎస్ నూతన చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించిన ఒగ్గు దామోదర్‌ను మండల యువజన నాయకులు బోనగిరి మహేందర్, రవి, విజయ్ మర్యాదపూర్వకంగా కలిసి ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. రైతుల అభ్యున్నతికి మరిన్ని సేవలు అందించాలని వారు ఆకాంక్షించారు. పీఏసీఎస్ ద్వారా రైతులకు అవసరమైన సహకారం అందిస్తూ సంఘాన్ని మరింత అభివృద్ధి చేయాలని కోరారు.

రైతులకు అందుబాటులో ఉంటా:

పీఏసీఎస్ అభివృద్ధికి ప్రతి ఒక్కరి సహకారం అవసరమని చైర్మన్ ఒగ్గు దామోదర్ తెలిపారు. రైతులకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ సహకార సంఘాన్ని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.