దేశంలో మార్పు కోసం సీపీఐ దేశవ్యాప్త పోరాటం…సెప్టెంబర్‌ 1న ఢిల్లీలో మహాధర్నా…

ఘట్‌కేసర్‌, ఆగస్టు 8: కేంద్రంలోని ఎన్‌డీఏ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలకు నిరసనగా, దేశంలో మార్పు కోసం భారత కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో దేశవ్యాప్త పోరాటానికి శ్రీకారం చుట్టనున్నట్లు సీపీఐ ఘట్‌కేసర్‌ మండల కార్యదర్శి లొట్టి ఈశ్వర్‌ తెలిపారు. శనివారం ఘట్‌కేసర్‌ జీహెచ్‌ఎంసీ పోచారం సర్కిల్‌ పరిధిలోని రాజీవ్‌ గృహకల్ప వద్ద దేశవ్యాప్త పోరాటానికి సంబంధించిన గోడపత్రికను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా లొట్టి ఈశ్వర్‌, ఏఐటీయూసీ రాష్ట్ర నాయకులు కల్లూరి జైచంద్ర మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వ విధానాల వల్ల యువత, విద్యార్థులు, కార్మికులు, రైతులు...