దివ్యాంగ చిన్నారుల ప్రతిభకు సలాం
క్యాడర్ పాఠశాలలో ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవం జాతీయ జెండాను ఆవిష్కరించిన తూము రవీందర్ పటేల్ 60 మంది విద్యార్థులకు ఉచితంగా యూనిఫామ్ల ప్రకటన సుల్తానాబాద్/పెద్దపల్లి ఆగస్టు 15 ప్రజావాణి : సుల్తానాబాద్లోని క్యాడర్ దివ్యాంగుల పాఠశాలలో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు కన్నులపండువగా జరిగాయి. ఈ కార్యక్రమానికి జిల్లా గెజిటెడ్ ఉద్యోగుల సంఘం అధ్యక్షులు తూము రవీందర్ పటేల్ ముఖ్య అతిథిగా హాజరై జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం సభ ప్రారంభంలో విద్యార్థులు, ఉపాధ్యాయులు కలసి జాతీయ గీతాన్ని ఆలపించారు. ఆకట్టుకున్న...