prajavaani.net
Newspaper Banner
Date of Publish : 20 August 2026, 9:13 am Digital Edition : SURENDHARTEKUMATLA TEKUMATLA

ఘనంగా ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవ వేడుకలు

ఘనంగా ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవ వేడులు

 

టేకుమట్ల: మారుతున్న కాలానికి అనుగుణంగా నూతన టెక్నాలజీతో ఫోటోగ్రాఫర్ వృత్తికి వన్నె తీసుకురావాలని ఫోటో అండ్ వీడియో గ్రాఫర్ సంక్షేమ సంఘం మండల అధ్యక్షుడు అంబరగొండ బుచ్చయ్య అన్నారు. బుధవారం మండల కేంద్రంలో ఫోటోగ్రాఫర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఫోటోగ్రఫీ పితామహుడు లూయిస్ మండే డాగురె చిత్రపటానికి పూలమాలవేసి కేక్ కటింగ్ చేశారు. వారు మాట్లాడుతూ ఫోటోగ్రఫీ రంగంపై ఆధారపడి వారు మారుతున్న టెక్నాలజీని అందిపుచ్చుకొని అభివృద్ధి చెందాలని సూచించారు. ఫోటోగ్రఫీ రాష్ట్ర సంఘం ప్రవేశపెట్టిన కుటుంబ భరోసా పథకాన్ని వినియోగించుకోవాలని మన కుటుంబాలకు భరోసాగా ఉండాలని అందరూ కుటుంబ భరోసా పథకంలో చేరాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఫోటోగ్రాఫర్స్ మండల ప్రధాన కార్యదర్శి ఆకునూరి సతీష్, కోశాధికారి బొంగోని నరేష్, సీనియర్ ఫోటోగ్రాఫర్ అలే నాగేందర్, బొంగోని తిరుపతి, నిమ్మల దేవేందర్, సోమిడి లింగమూర్తి, బోల్లి కొండ వెంకటేష్, బైరి ఇంద్రసేన, దాసారపు రవి, ఎర్రవెల్లి మహేష్, చిలుక మహేందర్, గౌడ ప్రవీణ్, కొయ్యడ సురేందర్, సందెల సురేందర్, గుర్రపు సాగర్, బందెల మనోజ్