prajavaani.net
Newspaper Banner
Date of Publish : 15 August 2026, 9:46 pm Digital Edition : PRAJA VANI

ఘనంగాఆర్టిఐ ఆధ్వర్యంలో  80 స్వతంత్ర దినోత్సవ వేడుకలు <br>

జిల్లా కార్య నిర్వాక  అధ్యక్షుడు దాట్ల శ్రీనివాస్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు

జమ్మికుంట మండల అధ్యక్షుడు నేదురు కుమారస్వామి  ఆధ్వర్యంలో

జమ్మికుంట ఆగస్టు  15 (ప్రజావాణి)

  జమ్మికుంట మండలంలో సమాచార హక్కు చట్టం సాధన కమిటీ జాతీయ అధ్యక్షులు చంటి ముదిరాజ్ రాష్ట్ర అధ్యక్షురాలు సుర స్రవంతి  ఆదేశాల మేరకు జమ్మికుంట మండల అధ్యక్షుడు నేదురు కుమారస్వామి  ఆధ్వర్యంలో కరీంనగర్ జిల్లా కార్య నిర్వాక  అధ్యక్షుడు దాట్ల శ్రీనివాస్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు 80వ స్వతంత్ర దినోత్సవ వేడుకలను అత్యంత ఉత్సాహంగా ఘనంగా నిర్వహించారు అనంతరం దాట్ల  శ్రీనివాస్ మాట్లాడుతూ స్వతంత్ర సమరయోధుల త్యాగాలు  ఎనలేనివని  వారి పోరాటాల ఫలితంగా నే నేడు మనం స్వేచ్ఛ వాయువు   పిలుస్తున్నామని  కొనియాడారు  వారి త్యాగాలను స్మరించుకుంటూ  దేశ అభివృద్ధిలో  ప్రతి ఒక్కరూ  భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు  ఈ కార్యక్రమంలో మండల ఉపాధ్యక్షులు గోవింద సతీష్ వర్కింగ్ ప్రెసిడెంట్ దాట్ల దుర్గాప్రసాద్ . ప్రధాన కార్యదర్శి నవీన్ కుమార్. ఉపాధ్యక్షులు అంబులెన్స్ శేఖర్ హుజురాబాద్ నియోజకవర్గం జెయింట్  సెక్రటరీ శెట్టి హరీష్  సెక్రటరీ ముజుబ్ మమ్మద్ ఇల్లంతకుంట మండల అధ్యక్షుడు ఎరుగొండ శ్రీనివాస్  ఆబదీ  జమ్మికుంట అధ్యక్షుడు నేదురు రాజు ఆర్టీఐ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు .