ఎండపల్లి మండలం గుల్లకోట గ్రామంలో లబ్ధిదారులకు మంజూరైన ముఖ్యమంత్రి సహాయ నిధి (CMRF) చెక్కులను సర్పంచ్ డాక్టర్ గొల్లపెల్లి మల్లేష్ గౌడ్ పంపిణీ చేశారు. మొత్తం రూ. 2,44,000 విలువగల చెక్కులను అందజేశారు. లబ్ధిదారులు బాస చిన్నయ్య (రూ. 13,500), చీకటి నాగమని (రూ. 40,000), గొల్లపెల్లి శ్రీనివాస్ (రూ. 60,000), కొంగరి లింగారెడ్డి (రూ. 20,000), మూల రమేష్ (రూ. 47,500), వేయిగాండ్ల రాజు (రూ. 23,000), వంగపెల్లి పోచయ్య (రూ. 40,000)లకు ఈ సాయం అందింది. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు బిసగొని సత్యం, భూసరపు భూమయ్య, వార్డు సభ్యులు పాలకుర్తి తిరుపతి, మూల ప్రశాంత్, బిసగోని అంజలి తిరుపతి, గొనె సంతోష్, బుర్ర తిరుపతి తదితరులు పాల్గొన్నారు.