గురువుకు ఘన సన్మానం.. శిష్యుల ఆత్మీయ కలయిక

  బేగంపేట, ఆగస్టు 16 (ప్రజావాణి): సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండల పరిధిలోని బేగంపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 1986–87 బ్యాచ్‌లో ఎస్‌ఎస్‌సీ పూర్తి చేసిన పూర్వ విద్యార్థులు తమకు బయోసైన్స్ బోధించిన గురువు అనంతరెడ్డి సార్‌ను కుటుంబ సమేతంగా కలిసి ఆత్మీయంగా సన్మానించారు.ఈ సందర్భంగా పూర్వ విద్యార్థులు నాటి జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు. అనంతరెడ్డి సార్‌ ఎంతో క్రమశిక్షణతో ఉంటూ, తన విధులను అంకితభావంతో నిర్వర్తించేవారని గుర్తుచేసుకున్నారు. విద్యార్థులను చదువులోనే కాకుండా జీవితంలోనూ ఉన్నతంగా ఎదగాలని అనేక విషయాల్లో ప్రోత్సహించేవారని తెలిపారు.పూర్వ విద్యార్థులు...