బెజ్జంకి, ఆగస్టు 27 (ప్రజావాణి)
సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలంలోని గుగ్గిళ్ల గ్రామ ప్రభుత్వ పాఠశాలలో ముందస్తు రాఖీ పౌర్ణమి వేడుకలను ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా విద్యార్థుల మధ్య ప్రేమ, సోదరభావం, ఆత్మీయతను పెంపొందించేలా వేడుకలను ఆనందోత్సాహాల మధ్య నిర్వహించారు. విద్యార్థులు ఒకరికొకరు రాఖీలు కట్టుకుని రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు తెలిపారు.
రాఖీ పండుగ విశిష్టతను ఉపాధ్యాయులు విద్యార్థులకు వివరించారు. సోదరభావం, పరస్పర ప్రేమ, ఐక్యతను చాటే రాఖీ పండుగ ప్రాధాన్యతను విద్యార్థులకు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.