prajavaani.net
Newspaper Banner
Date of Publish : 18 August 2026, 11:08 am Digital Edition : RAJASHEKARREDDY

గుండారంలో మృతుల కుటుంబాలను పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్

బెజ్జంకి, ఆగస్టు 18 (ప్రజావాణి)

సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలంలోని గుండారం గ్రామంలో ఇటీవల మృతి చెందిన ఎలుగు మెట్ల లక్ష్మి, శాన బాగయ్య, గౌరవేని రాజవ్వ కుటుంబాలను మాజీ ఎమ్మెల్యే డా. రసమయి బాలకిషన్ పరామర్శించారు.మృతుల చిత్రపటాలకు నివాళులర్పించి, కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.విషాద సమయంలో బాధిత కుటుంబాలకు అండగా ఉంటామని, ధైర్యంగా ఉండాలని రసమయి బాలకిషన్ సూచించారు.ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్ మండల బెజ్జంకి అధ్యక్షులు పాకాల మహిపాల్ రెడ్డి, సీనియర్ నాయకులు లింగాల లక్ష్మణ్, సర్పంచ్ తాళ్ల భీమయ్య, గ్రామ శాఖ అధ్యక్షుడు కత్తి అంజయ్య, మాజీ ఎంపీటీసీ గురువారెడ్డి, ఎలుక దేవయ్య, బొమ్మకంటి రామలింగారెడ్డి, శాన రమేష్, పోతుల హరీష్, సూరం శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.