బెజ్జంకి, ఆగస్టు 18 (ప్రజావాణి):
సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలంలోని కళ్లేపల్లి గ్రామంలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 376వ జయంతి వేడుకలను గౌడ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సర్వాయి పాపన్న గౌడ్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.ఈ కార్యక్రమానికి గౌడ సంఘం అధ్యక్షులు బుర్ర లింగయ్య, బుర్ర దత్తాత్రేయ గౌడ్, వడ్లకొండ శ్రీనివాస్ గౌడ్, గౌడ సంఘం సభ్యులు బుర్ర తిరుపతి గౌడ్ తదితరులు పాల్గొన్నారు. ముఖ్య అతిథులుగా సర్పంచ్ బిగుల్లా మోహన్, ఉపసర్పంచ్ శేషి వినీత్ గౌడ్ హాజరయ్యారు.ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ బహుజనుల కోసం పోరాడిన గొప్ప వీరుడని, ఆయన ఆశయాలను నేటి తరానికి తెలియజేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని అన్నారు.ఈ కార్యక్రమంలో గౌడ సంఘం నాయకులు శ్రీను, అనిల్, నరేష్, శివ, శ్రీకాంత్, ప్రశాంత్, మహేష్, కిరణ్, వంశీ, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.