prajavaani.net
Newspaper Banner
Date of Publish : 21 August 2026, 2:15 pm Digital Edition : UPPU RAMESH JAGITHYAL

ఎండపల్లిలోనే ప్రభుత్వ కార్యాలయాలు నిర్మించాలి: మంత్రి అడ్లూరికి వినతి

ఎండపల్లి మండల కేంద్రంలోనే ప్రభుత్వ కార్యాలయాలను నిర్మించాలని కోరుతూ సర్పంచ్ మారం సునీత జలంధర్ రెడ్డి నేతృత్వంలో గ్రామస్థులు, కుల సంఘాల నాయకులు ఈరోజు మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్‌కు వినతిపత్రం సమర్పించారు. కార్యాలయాలు ఒకేచోట ఉంటే ప్రజలకు రవాణా ఇబ్బందులు తప్పుతాయని వివరించారు. దీనిపై స్పందించిన మంత్రి సానుకూల చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. అనంతరం, ప్రధాన రహదారి పక్కన జొన్నలరాసి గుట్ట వద్ద ఉన్న మూడు ఎకరాల ప్రభుత్వ స్థలాన్ని గ్రామస్థులు కార్యాలయాల నిర్మాణం కోసం పరిశీలించారు.