ఇప్పలపల్లి లో వార్డ్ సభ్యులకు సమాచారం లేకుండా గ్రామసభ
మొగుళ్లపల్లి /ప్రజావాణి :
మొగుళ్లపల్లి మండలం ఇప్పలపల్లి గ్రామం లోని ఆగష్టు 11న వార్డ్ సభ్యులకు ముందస్తు సమాచారం ఇవ్వకుండానే గ్రామ సభ నిర్వహించారు అని 1వ వార్డ్ మెంబెర్ దూడపాక శ్రీధర్ మరియు దూడపాక శ్రీకాంత్ శ్రీ కృష్ణ మాట్లాడుతూ.ఎజెండా పుస్తకం అందించకుండా సభ్యుల సంతకాలు తీసుకోకుండా సభ నిర్వహించడం పంచాయతీరాజ్ చట్టం -2018కు విరుద్ధమని పేర్కొంది బాధ్యులపై సమగ్ర విచారణ జరిపి చర్యలు తీసుకోవాలి అని ఎంపీడీవో ను కోరారు సర్పంచ్ ఉప సర్పంచ్ల పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది. మండల వరర్డ్ మెంబెర్ ల ఫోరం ఆరోపించారు.ఈ కార్యక్రమం లో మొగుళ్ళపల్లి మండల వార్డు మెంబర్ల ఫోరం అధ్యక్షులు చిలుమారి శ్రీనివాస్, గౌరవ అధ్యక్షులు బండారి కుమార్, ప్రధాన కార్యదర్శి దూడపాక శ్రీకృష్ణ, మరియు మొగుళ్లపల్లి మండలం వార్డు సభ్యులు మహేష్ పాల్గొన్నారు