అమ్మ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఘనంగారాజీవ్ గాంధీ జయంతి వేడుకలు అరటి పండ్లు పంపిణీ
* జిల్లా అధ్యక్షులు గోనెల సమ్మన్న ముదిరాజ్.టీపీసీసీ సాంస్కృతిక కళాబృందం
జమ్మికుంట ఆగస్టు 20 (ప్రజావాణి)
కరీంనగర్ జిల్లా వీణవంక మండలంమల్లారెడ్డిపల్లి గ్రామానికి చెందిన అమ్మ ఫౌండేషన్ మల్లారెడ్డిపల్లి తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ సాంస్కృతిక సేన కరీంనగర్ జిల్లా కళాకారుల సంయుక్త నిర్వాహణలో రాజీవ్ గాంధీ జయంతిని పురస్కరించుకొని వీణవంక మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల అంగన్వాడి కేంద్రం పిల్లలకు ప్రాథమిక ఉన్నత పాఠశాలలోని సుమారు 200 మంది విద్యార్థిని, విద్యార్థులకు అరటిపండ్లు పంపిణీ చేసినారుఅనంతరం గోనెల సమ్మన్న ముదిరాజ్ మాట్లాడుతూ రాజీవ్ గాంధీ భారత దేశ ప్రధానిగా ఎనలేని సేవలు చేసి దేశం కోసం తమ ప్రాణాలను త్యాగం చేసినారని ఈ సందర్భంగా వారి సేవలను గుర్తు చేసుకుంటు వారికి ఘనమైన నివాళులు అర్పించినారుఈ కార్యక్రమంలో అమ్మ ఫౌండేషన్ మల్లారెడ్డిపల్లి వ్యవస్థాపక అధ్యక్షులు
తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ సాంస్కృతిక సేన కరీంనగర్ జిల్లా అధ్యక్షులు గోనెల సమ్మన్న ముదిరాజ్.టీపీసీసీ సాంస్కృతిక సేన హుజురాబాద్ నియోజకవర్గం ఇంచార్జ్,సింగర్ పొట్టాల శివకుమార్, అమ్మ ఫౌండేషన్ సభ్యులు గోనెల రుశికేష్(బన్నీ), రాయణవేణి సాత్విక్
నిమ్మల శివమణి(మల్లన్న) మరియు తదితరులు పాల్గొన్నారు.

