prajavaani.net
Newspaper Banner
Date of Publish : 01 July 2026, 9:39 pm Digital Edition : NAVEEN NADIKUDA

ఇటిక్యాలలో ఐజెల్ వాటర్ ప్లాంట్‌ను ప్రారంభించిన స్వప్న సురేందర్ గౌడ్

ఇటిక్యాలలో ఐజెల్ వాటర్ ప్లాంట్‌ను ప్రారంభించిన స్వప్న సురేందర్ గౌడ్

మన సమగ్ర ప్రజావాణి జులై 01

సంగారెడ్డి జిల్లా ప్రతినిధి

అందోల్ మండలంలోని ఎస్. ఇటిక్యాల గ్రామంలో ప్రజలకు స్వచ్ఛమైన తాగునీరు అందించాలనే లక్ష్యంతో ఏర్పాటు చేసిన ఐజెల్ వాటర్ స్టేషన్‌ను స్వప్న సురేందర్ గౌడ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించి ప్లాంట్‌ను ప్రజలకు అంకితం చేశారు.

ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, ప్రజాప్రతినిధులు, స్థానిక నాయకులు, గ్రామస్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. గ్రామ ప్రజలకు నాణ్యమైన, సురక్షితమైన తాగునీరు అందుబాటులోకి రావడం ఆనందదాయకమని వారు పేర్కొన్నారు. ఈ వాటర్ ప్లాంట్ ద్వారా గ్రామ ప్రజలకు 24 గంటల పాటు స్వచ్ఛమైన తాగునీరు అందించే అవకాశం కలుగుతుందని నిర్వాహకులు తెలిపారు.