
ఆళ్లగడ్డ(జూన్ 15 ప్రజావాణి) ఎస్ఎఫ్ఐ ఆళ్లగడ్డ మండల కమిటీ సమావేశంకు ముఖ్య అతిధిగా ఎస్ఎఫ్ఐ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం.ఆర్.నాయక్ పాల్గొన్నారు.ఈసందర్బంగా వారు మాట్లాడుతూ ప్రైవేటు,కార్పొరేట్ పాఠశాలలు,కళాశాలలు ఫీజు నియంత్రణ చట్టాన్ని కచ్చితంగా అమలు చేయాలి,ఫీజుల వివరాలను నోటీసు బోర్డులో ప్రదర్శించాలి,పాఠశాల ఆవరణలో పుస్తకాలు,యూనిఫార్ములు,ఇతర విద్యా సామగ్రి విక్రయాలను నిలిపివేయాలిని చట్టం ఉన్నా జిల్లా లోన్న ప్రెవేట్,కార్పొరేట్ పాఠశాలలు కళాశాలలు చట్టానికి వ్యతిరేకంగా విద్యను వ్యాపారం చేస్తూ విద్యార్థుల తల్లి తండ్రుల కష్టాలను కాసులుగా మారుస్తూ విద్యా వ్యాపార దోపిడీ మాఫియా చలామణి అవుతున్నా విద్యా శాఖ అధికారులు నిమ్మకు నీరు ఎత్తనట్టు వ్యాహరిస్తున్నారు,తక్షణమే విద్యా శాఖ అధికారులు నిద్ర మేలుకొని పేద, బడుగు, బలహీన వర్గ విద్యార్థులకు విద్యను అందెల చూడాలని లేని పక్షంలో ఎస్ ఎఫ్ ఐ ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా ప్రత్యేక్ష ఆందోళనలు,ముట్టడిలు నిర్వహిస్తామని వారు ఆన్నారు.ఈ ఈకార్యక్రమంలో ఆళ్లగడ్డ మండల కార్యదర్శి లతీఫ్ ఎస్ఎఫ్ఐ నాయకులు ప్రేమ్,హర్ష,రాజేష్,దస్తగిరి,మధు,హరి,తదితరులు పాల్గొన్నారు