prajavaani.net
Newspaper Banner
Date of Publish : 15 June 2026, 2:50 pm Digital Edition : RAJASHEKARREDDY

ఫర్టిలైజర్ షాపులను ఆకస్మికంగా తనిఖీ చేసిన బెజ్జంకి మండల వ్యవసాయ అధికారి సంతోష్

 

బెజ్జంకి,జూన్ 15(ప్రజావాణి )

సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలంలోని ఫర్టిలైజర్, విత్తన దుకాణాలను మండల వ్యవసాయ అధికారి సంతోష్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా దుకాణదారులకు పలు సూచనలు చేశారు.రైతులకు ఎట్టి పరిస్థితుల్లోనూ అధిక ధరలకు ఎరువులు, విత్తనాలు విక్రయించరాదని, దుకాణాల్లో స్టాక్ బోర్డులను తప్పనిసరిగా ప్రదర్శించాలని సూచించారు. ప్రతి కొనుగోలు చేసిన రైతుకు తప్పనిసరిగా బిల్లు ఇవ్వాలని ఆదేశించారు.
విత్తనాల నాణ్యతను నిర్ధారించేందుకు నమూనాలను సేకరించి ప్రయోగశాలకు పంపినట్లు తెలిపారు. నకిలీ విత్తనాల విక్రయాలకు పాల్పడిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రైతులు నాణ్యమైన విత్తనాలు, ఎరువులను మాత్రమే కొనుగోలు చేసి బిల్లులు భద్రపరుచుకోవాలని వ్యవసాయ అధికారి సంతోష్ సూచించారు.