prajavaani.net
Newspaper Banner
Date of Publish : 09 June 2026, 8:29 pm Digital Edition : VIJAYKUMAR SIDDIPET

జిల్లా కేంద్రంలోనీ జిల్లా కోర్టు కాంప్లెక్స్ డిస్టిక్ కోఆర్డినేషన్ కమిటీ మీటింగ్.. జిల్లా ప్రధాన న్యాయమూర్తి సాయి రమాదేవి అధ్యక్షతన..

సిద్దిపేట జూన్ 9, ప్రజావాణి

జిల్లా కేంద్రంలోనీ జిల్లా కోర్టు కాంప్లెక్స్ డిస్టిక్ కోఆర్డినేషన్ కమిటీ మీటింగ్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి సాయి రమాదేవి అధ్యక్షతన జరిగింది.ఈ సమావేశంలో జిల్లా అదనపు న్యాయమూర్తి జయ ప్రసాద్, జిల్లా కలెక్టర్ కె. హైమావతి, వివిధ కోర్ట్ ల జడ్జిలు, పబ్లిక్ ప్రాసిక్యూషన్ లాయర్లు, ఏసిపిలు తదితరులు పాల్గొన్నారు.ఈ సమావేశంలో జిల్లా ప్రధాన న్యాయమూర్తి జిల్లాలో సివిల్ మరియు క్రిమినల్ కేసుల పెండింగ్ పైన చర్చించారు. చాలా కాలం నుండి పెండింగ్ లో ఉన్న సివిల్ మరియు క్రిమినల్ కేసులు పూర్తి చెయ్యమన్నారు. అలాగే ఈ నెల 20 వ తేదీన జాతీయ లోక్ అదాలత్ లో వివిధ కేసుల పరిష్కార విషయంలో వేగం పెంచి రాష్ట్రంలోనే అత్యధిక కేసులు పరిష్కారం లో ముందు వరసలో ఉండే విదంగా న్యాయ, పోలీస్ అధికారులు పనిచేయాలని ఆదేశించారు. అందరు అధికారులు సమన్వయంతో పెండింగ్ లో ఉన్న కేసులు త్వరగా పరిష్కారం అయ్యే విధంగా పని చేయాలని ఆదేశించారు.