prajavaani.net
Newspaper Banner
Date of Publish : 12 June 2026, 4:58 pm Digital Edition : UPPU RAMESH JAGITHYAL

జగిత్యాల జిల్లాలో సీపీఐ మార్కెట్ సర్వే ధరలు, వేతనాలపై పర్యవేక్షణ

జగిత్యాల జిల్లా ఎండపల్లిలో కేంద్ర గణాంకాల కార్యాలయ అధికారులు సీపీఐ మార్కెట్ సర్వే చేపట్టారు. ఉప ప్రాంతీయ అధికారి రాజేష్ కుమార్ (I.S.S) స్వయంగా క్షేత్రస్థాయిలో పర్యటించి, నిత్యావసర వస్తువుల ధరలు, కార్మికుల వేతనాల వివరాలను సేకరించారు. ద్రవ్యోల్బణ గణనలో కీలకంగా ఉండే ఈ డేటా సేకరణ ప్రక్రియను ఆయన పర్యవేక్షించారు. ఈ సర్వేలో ఎన్యూమరేటర్ సోమ అఖిల్ పనితీరును అభినందిస్తూ, ధరల సూచిక తయారీకి అవసరమైన సమగ్ర సమాచారాన్ని నమోదు చేయడం జరిగిందని అధికారులు పేర్కొన్నారు.