prajavaani.net
Newspaper Banner
Date of Publish : 12 May 2026, 2:52 pm Digital Edition : MADHUBABU ANDRAPRADESH

బ్రహ్మంగారి మఠం లో పలు చోట్ల వ్యవసాయ మోటార్ల కేబుల్ వైర్లు దొంగతనం.

వైయస్సార్ కడప జిల్లా ప్రజావాణి న్యూస్ (మే12)  బ్రహ్మంగారిమఠం మండలంలో సోమిరెడ్డి పల్లె సచివాలయం 2,చౌదరి వారి పల్లె గ్రామంలో నిన్న రాత్రి ఐదు మంది రైతుల కేబుల్ వైర్లు చోరీ..ఒక్కో మోటర్ వద్ద 40 నుండి 50 మీటర్ల కేబుల్ వైరు ను కత్తిరించి తీసుకెళ్తున్న దొంగలు..మీటర్ 200 చొప్పున ధర పలుకుతుంది.. ఒక్కో రైతు మోటార్కు ఏడు నుండి ఎనిమిది వేల రూపాయల కేబుల్ కొనాల్సి వస్తుంది..కేబుల్ వైర్లు కట్ చేసుకుని వెళ్లడంతో మోటర్ ను ఎత్తి అనంతరం దించే ఖర్చులతో సతమతమవుతున్న రైతులు .పోలీసులు కేబుల్ వైర్ల దొంగలపై నిఘా ఉంచి దొంగతనాలను అరికట్టాలని రైతులు కోరుతున్నారు