prajavaani.net
Newspaper Banner
Date of Publish : 21 May 2026, 8:18 pm Digital Edition : MADHUBABU ANDRAPRADESH

దళితుల హక్కుల కోసం జడ శ్రావణ్ కుమార్ పోరాటం అభినందనీయం : మాల మహానాడు నాయకులు

విజయవాడ, (మే21ప్రజావాణి) మాల మహానాడు జి చెన్నయ్య వర్గం నాయకులు ఈరోజు విజయవాడలో జై భీమ్ భారత్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు, హైకోర్టు ప్రముఖ న్యాయవాది జడ శ్రావణ్ కుమార్ గారిని మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు.ఈ కార్యక్రమంలో కడప జిల్లా అధ్యక్షులు జ్యేష్ఠాది భాస్కర్, ప్రకాశం జిల్లా అధ్యక్షులు మంచా సాయి, కడప జిల్లా ఉపాధ్యక్షులు బేరీ అహరోన్ పాల్గొన్నారు. రాష్ట్రంలో దళిత సామాజిక వర్గానికి ఏ సమస్య వచ్చినా ముందుండి పోరాడుతూ, దళితుల హక్కుల పరిరక్షణ కోసం నిరంతరం కృషి చేస్తున్న జడ శ్రావణ్ కుమార్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.దళిత సామాజిక వర్గానికి న్యాయం జరిగేలా చట్టపరమైన పోరాటాలు చేస్తూ అండగా నిలుస్తున్న ఆయన సేవలు అభినందనీయమని నాయకులు పేర్కొన్నారు