కలసపాడు మండలంలో బలమైన పెనుగాలుల ప్రభావంతో పలుచోట్ల విద్యుత్ స్తంభాలు విరిగిపడటంతో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది

కడప జిల్లా (మే20 ప్రజావాణి) కలసపాడు మండలంలో బలమైన పెనుగాలుల ప్రభావంతో పలుచోట్ల విద్యుత్ స్తంభాలు విరిగిపడటంతో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది.పిడుగుపల్లె సబ్‌స్టేషన్ పరిధిలోని రంపాడు రోడ్డు మార్గంలో ఎక్కువగా నష్టం సంభవించినట్లు అధికారులు తెలిపారు.సమాచారం అందుకున్న వెంటనే విద్యుత్ శాఖ అధికారులు, సిబ్బంది రాత్రి సమయంలోనే ఘటనాస్థలాలకు చేరుకుని విరిగిపోయిన స్తంభాలను గుర్తించే పనులు చేపట్టారు.ఇప్పటివరకు మొత్తం 9 విద్యుత్ స్తంభాలు విరిగిపడినట్లు గుర్తించిన అధికారులు, విద్యుత్ సరఫరా పునరుద్ధరణ కోసం చర్యలు కొనసాగిస్తున్నారు.