
కడప జిల్లా మే 17 ప్రజావాణి పోరుమామిళ్ల మండలO లోని ఎమ్మార్వో ఆఫీస్ లో అటెండర్ గా పనిచేస్తున్న షేక్ మౌలాలి గతంలో కడప కలెక్టర్ ఆఫీస్ లో పనిచేసే కొన్ని నెలల క్రితం పోరుమామిళ్ల ఎమ్మార్వో ఆఫీస్ లో ఎమ్మార్వో అటెండర్ గా జాయిన్ అవ్వడం జరిగింది,వచ్చినప్పటి నుంచి ఎమ్మార్వో సంతకం చేసిన ఏ ఫై లైన సీలు వేయాలంటే లంచం ఇస్తే గాని సీలు వేయడం లేదు,అని అక్కడికి వచ్చిన ప్రజలు వాపోతున్నారు 200 కొట్టు సీలు పట్టు అంటున్నాడు (దేవుడు కరుణిస్తే పూజారి వరము ఇవ్వడం లేదు )అనేది ఈ సామెత ఇక్కడ వర్తిస్తుందని ప్రజలు వాపోతున్నారు,ఒక అటెండర్ సీలు వేయడం కోసం డబ్బులు డిమాండ్ చేస్తున్నాడు అంటే మిగతా వీఆర్వోలు కూడా లంచం డిమాండ్ చేస్తున్నారని అక్కడికి వచ్చిన సామాన్య రైతులు వాపోతున్నారు,ప్రభుత్వ అధికారులు అనగానే నిర్లక్ష్యం,అవినీతి గుర్తుకు వస్తాయి.జాబ్ రావడానికి కష్టపడతారు కానీ,జాబ్ లో చేరాక మాత్రం పని చేయడంలో కొందరు ఉద్యోగులు పూర్తిగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. అలాగే ఆ పని చేసేందుకు కొందరు అధికారులు లంచం డిమాండ్ చేస్తున్నారు.ఏ ప్రభుత్వ విభాగం అయినా.ఈ రెండింటిలో ఏదో ఒకటి ఉంటుంది. అవినీతికి ఆస్కారం లేని చోట నిర్లక్ష్యం తాండవిస్తుంది.అయితే చాలా మంది ప్రభుత్వ అధికారులు తీరు ఇలాగే ఉంటుంది,ఎమ్మార్వో ఆఫీసుల చుట్టూ తిరగడం ఒక ఎత్తు అయితే లంచాల ఇవ్వడం మరొక ఎత్తు అవుతుంది లంచమిచ్చితే గాని ఫైల్ మీద సంతకం పెట్టే పరిస్థితిలో పోరుమామిళ్ల ఎమ్మార్వో ఆఫీసులో ఉండే అధికారుల పరిస్థితి ఇది,పోరుమామిళ్ల ఎమ్మార్వో ఆఫీస్ ను సంబంధించిన అధికారులు తనిఖీ చేసి ఒకసారి సామాన్య ప్రజల బాధను అర్థం చేసుకుంటారని ఒక రైతు ఆవేదన, మిగతా వివరాలు రేపటి సంచికలో మీ ప్రజావాణి లో