prajavaani.net
Newspaper Banner
Date of Publish : 08 April 2026, 10:09 am Digital Edition : MADHUBABU ANDRAPRADESH

1011సర్వే నెంబర్ ల్లో నిరుపేద గిరినగర్ వాసులకు భవన నిర్మాణ కార్మికులకు ఇంటి పట్టాలు కల్పించాలి.. సిపిఎం

ప్రజావాణి న్యూస్(ఏప్రిల్08)పోరుమామిళ్ల 1011సర్వే నెంబర్ ల్లో నిరుపేద గిరినగర్ వాసులకు భవన నిర్మాణ కార్మికులకు ఇంటి పట్టాలు కల్పించాలి.సిపిఎం మండల కమిటి ఆద్వర్యంలో గిరినగర్ ఎదురుగా ఉన్నా 1011 సర్వే నెంబరు ఎలా గల స్థలంలో నిరుపేద కుటుంబాలు నిరుపేద బడుగు బలహీన వర్గాలు అయినటువంటి వారికి ప్రభుత్వ భూమి అయినటువంటి 10 11 సర్వే నెంబర్ లో ఒకటిన్నర సెంటు స్థలం కల్పించాలని,10 11 సర్వే నంబర్ గల స్థలము నందు నిరసన ధర్నా కార్యక్రమం చేయడం జరిగింది,ఈ సందర్భంగా సిపిఎం మండల కార్యదర్శి యన్ భైరవప్రసాద్ సిఐటియు నాయకులు సోమయ్య,ప్రకాష్ మాట్లాడుతూ.గిరినగర్,మాబునగర్ ప్రాంతంలో ఒకే ఇంట్లో రెండు మూడు కుటుంబాలుగా జీవనం చేసుకుంటు ఉండే కుటుంబాలకుఉన్నాయినీ వారికి పట్టాలు కల్పించాలని ఇలాంటి కుటుంబాలను ఇంటింటికి పోయి సమాచారం తీసుకొని సిపిఎం పరిశీలించిందన్నారు ప్రతికుటుంబానికి ఒకటిన్నర సెంటు ఇంటి స్థలం పట్టా కల్పించి ఆదుకోవాలని ఇప్పటికీ ఎన్నో దుపాలుగా ఇంటి స్థలాల కోసం 10 11 సర్వే నెంబరు గల స్థలంలో అప్లికేషన్లు సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఎమ్మార్వో ఆఫీస్ నందు ఇచ్చామన్నారు గతంలో భవనిర్మాణ కార్మికులు 10 11 సర్వే నంబరు గల పొలం నందు గుడిసెలు కూడా వేసి వారు జీవనం చేసి ఉన్నారని వారందరూ కూడ చాలా నష్టపోయారు వారికి కూడా పట్టాలుకల్పించాలనీ వారు అన్నారు,ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు ఆలీ భాష,బడేపీరా,మేరి ప్రసాద్ గాబ్రియేల్,రామసుబ్బయ్య తదితరులు పాల్గొన్నారు,అభినందనలతో.యన్ భైరవప్రసాదు సిపిఎం మండల కార్యదర్శి