10వ తరగతి ఫలితాల్లో సత్తా చాటిన మన్మర్రి ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు
మన్మర్రి ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు 10వ తరగతి ఫలితాల్లో విశేష ప్రతిభ కనబరచి గ్రామానికి గర్వకారణమయ్యారు
ప్రథమ, ద్వితీయ, తృతీయ ర్యాంకులను సాధించిన విద్యార్థినులు ప్రత్యేకంగా నిలిచారు
విద్యార్థుల విజయంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు జి.హెచ్.ఎం బస్సప్ప సర్ గారి కృషి విశేషంగా నిలిచింది
ప్రత్యేక తరగతులు నిర్వహిస్తూ, ప్రతి విద్యార్థిపై శ్రద్ధ చూపడం వల్ల పాఠశాల 100% ఉత్తీర్ణత సాధించింది.
ఈ సందర్భంగా గ్రామస్థులు జి.హెచ్.ఎం బస్సప్ప సర్ గారికి, ఉపాధ్యాయ బృందానికి మరియు ప్రతిభ చూపిన విద్యార్థులకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు.