Date of Publish : 14 April 2026, 2:47 pmDigital Edition : VEMULARAMESH MOTHE
స్వాతంత్ర భారత దేశానికి అంబేద్కర్ చేసిన సేవలు మరువ లేనివి మామిళ్ళగూడెం గ్రామంలో డా|| బి.ఆర్ అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. మోతే ఏప్రిల్ 14 (ప్రజావాణి) మామిళ్ళగూడెం గ్రామపంచాయతీ పరిధిలో సంఘ సంస్కర్త,ప్రపంచ మేధావి, భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ గారి జయంతి ఉత్సవాలలో గ్రామ సర్పంచ్ కొరివి నాగమణి వీరాస్వామి గారు మాట్లాడుతూ భారత దేశానికి వారు చేసిన సేవలు మరువ లేనివి అన్నారు. ఇట్టి కార్యక్రమం లో శ్రీ వేంకటేశ్వర విద్య సంస్థల అధినేత md జనిమియా గారు అంబేద్కర్ గారు ఏ ఒక్క కుళానికో మతానికో చెందిన వారుకాదు అందరి వాడు అని కొనియాడి నాడు….ఇట్టి కార్యక్రమం లో నర్సయ్య,రామకోటయ్య,వెంకన్న,అంబేద్కర్, జానిపాషా మరియు గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.