prajavaani.net
Newspaper Banner
Date of Publish : 10 April 2026, 8:05 am Digital Edition : MADHUBABU ANDRAPRADESH

సి.ఐ.టి.యు 10వ జిల్లా మహాసభలను జయప్రదం చేయండి,,యన్ భైరవ ప్రసాదు పిలుపు

కడప జిల్లాప్రజావాణి న్యూస్(ఏప్రిల్10) పోరుమామిళ్లలో కార్మికులకు కనీస వేతనాలు 26 వేలు కల్పించాలి స్థానిక పోరుమామిళ్లలోని విశ్రాంతి భవనం నందు సెంటర్ ఆఫ్ ఇండియన్ ట్రేడ్ యూనియన్స్ సిఐటియు ఏప్రిల్ 11న పాత రిమ్స్ నందు జరుగు పదోవ జిల్లా మహాసభలను జయప్రదం చేయాలని సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు యన్ భైరవ ప్రసాద్ విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఆ‌సందర్బంగా సిఐటియు జిల్లా ఉపాధ్యక్షుడు యన్ భైరవప్రసాదు మాట్లాడుతూ .ముఖ్యంగా ఈ మహాసభలకు ముఖ్యఅతిథిగా సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ సిహెచ్ నర్సింగరావు గారు, రాష్ట్ర ఉపాధ్యక్షులు ఓబులు గారు ,హాజరవుతున్నట్లు తెలిపారు. గత మూడు సంవత్సరాల కాలంలో జరిగినటువంటి కార్యక్రమాల పైన చర్చించి భవిష్యత్తులో కార్మిక వర్గంపై జరుగుతున్నటువంటి దాడిని ఎలా ఎదుర్కోవాలని అంశాల పైన చర్చించి భవిష్యత్తు ప్రణాళిక రూపొందించడం జరుగుతుందన్నారు . పోరుమామిళ్ల కలసపాడు కాశినాయన బీకోడూరు మండలాల సిఐటియు రంగాల నాయకులందరూ ప్రతినిధులు అందరూ కూడాకనుక జిల్లాలో ఉన్నటువంటి ప్రతినిధి వర్గం ఉదయం 9 గంటలకల్లా కచ్చితంగా చేరుకొని మహాసభలను జయప్రదం చేయాలని వారు పిలుపునిచ్చారు.ఈ సందర్భంగా సిఐటియు తాత్కాలికనూతన పోరుమామిళ్ల మండల కమిటీఏర్పడడం జరిగింది అధ్యక్షుడిగా గుడిమే సోమయ్య ప్రధాన కార్యదర్శిగా సగిలి ప్రకాష్ ఉపాధ్యక్షులు సహాయ కార్యదర్శులుగా షేక్ అలీ భాష,షేక్ మహబూబ్, బాషా,షేక్ బాషా,జ్యోతిమ్మ, స్తగిరిమ్మ ,మాహాభూపీరా,నజీర్,రమణయ్య రూఫాయిల్. చిన్నయ్య,గురయ్య ఎన్నిక కావడం జరిగింది,అభినందనలతో.యన్ భైరవ ప్రసాద్ సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు