prajavaani.net
Newspaper Banner
Date of Publish : 03 April 2026, 9:55 am Digital Edition : VIJAYKUMAR SIDDIPET

సిద్దిపేటలో పరిస్థితి పూర్తిగా ప్రశాంతం: వదంతులను నమ్మవద్దు..

 

సిద్దిపేటలో పరిస్థితి పూర్తిగా ప్రశాంతం: వదంతులను నమ్మవద్దు.

సిద్దిపేట్, ఏప్రిల్ 3, ప్రజావాణి

సిద్దిపేట పట్టణంలో ప్రస్తుత పరిస్థితి పూర్తిగా ప్రశాంతంగా, పోలీసుల నియంత్రణలో ఉందని సిద్దిపేట వన్ టౌన్ ఇన్స్పెక్టర్ వాసుదేవరావు ఒక ప్రకటనలో తెలిపారు. ప్రజలెవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, శాంతిభద్రతల పరిరక్షణకు పోలీస్ శాఖ అన్ని రకాల ముందస్తు చర్యలు చేపట్టిందని స్పష్టం చేశారు.వాట్సాప్, ఫేస్‌బుక్, ఎక్స్ (ట్విట్టర్) వంటి సామాజిక మాధ్యమాల్లో వచ్చే తప్పుడు వార్తలను ప్రజలు నమ్మవద్దు. అవాస్తవాలను ప్రచారం చేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలియజేశారు.ఏదైనా సమాచారం ఉంటే వెంటనే స్థానిక పోలీసులకు లేదా డైల్ 100కు సమాచారం అందించాలి. బాధ్యతాయుతమైన పౌరులుగా వ్యవహరిస్తూ శాంతి స్థాపనకు సహకరించాలని సూచించారు.సోషల్ మీడియా గ్రూపుల అడ్మిన్లు కూడా అప్రమత్తంగా ఉండి, రెచ్చగొట్టే పోస్టులను అనుమతించవద్దని ఈ సందర్భంగా ఇన్స్పెక్టర్ వాసుదేవరావు సూచించారు.