prajavaani.net
Newspaper Banner
Date of Publish : 14 April 2026, 8:19 am Digital Edition : MADHUBABU ANDRAPRADESH

సామాజిక న్యాయం అంటే నినాదం కాదు సమానత్వం కోసం యుద్ధం అంటూ ఆజన్మాంతం గడిపిన డాక్టర్ బీఆర్ అంబేద్కర్  గారి జయంతి

శ్రీ పొట్టి శ్రీరాములునెల్లూరు జిల్లా ప్రజావాణి న్యూస్(ఏప్రిల్14) సందర్బంగా వారి ఘన నివాళులు”జీవితం సుదీర్ఘంగా ఉండక్కర్లేదు.గొప్పగా ఉండాలి.అని వారు ఆచరణ లో చూపారు.కిషోర్ గునుకుల జనసేన పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి భారత రాజ్యాంగ శిల్పి, సామాజిక న్యాయ యోధుడు,మహానుభావుడు డా.బి.ఆర్.అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా నెల్లూరు సిటీ వి ఆర్ సి సెంటర్‌లోని వారి విగ్రహానికి జనసేన పార్టీ నాయకులు మాలలు వేసి ఘన నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ,డాక్టర్ బీఆర్ అంబేద్కర్ గారు ఏ ఒక్క వర్గానికి మాత్రమే చెందిన వారు కాదని,విశ్వమేదావిగా, సమానత్వానికి ప్రతీకగా,సామాజిక విప్లవ కారుడిగా,భారత రాజ్యాంగ రూపకర్తగా ప్రపంచవ్యాప్తంగా మన్ననలు పొందిన మహానుభావుడని పేర్కొన్నారు.స్వేచ్ఛ,సమానత్వం, సౌభ్రాతృత్వం అనే మూల సూత్రాలతో రాజ్యాంగాన్ని రచించిన అంబేద్కర్ గారి ఆశయాలను భావితరాలకు అందించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని తెలిపారు.అదే విధంగా జనసేన పార్టీ అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆశయాలకు అనుగుణంగా,సామాజిక న్యాయం,సమాన అవకాశాలు కల్పించే దిశగా జనసేన పార్టీ నిరంతరం కృషి చేస్తుందని స్పష్టం చేశారు.“సమాజంలోని ప్రతి ఒక్కరికీ గౌరవం,అవకాశాలు దక్కేలా పోరాడటం జనసేన లక్ష్యం”అని తెలిపారు.ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నెల్లూరు జిల్లా ప్రధాన కార్యదర్శి కిషోర్ గునుకుల,సీనియర్ నాయకులు చిట్టమూరు ప్రవీన్ రెడ్డి,జిల్లా సమయక్త కార్యదర్శి ప్రశాంత్ గౌడ్,జనసేన నాయకులు పప్పు సాయి,రుషికేష్ యాదవ్, బ్లూబోర్డు యజమాని వేముల శివకృష్ణ,నాగేంద్ర బాలు,హర్ష,రాఘవ, విశ్వనాద్,హరి, కార్తీక్ చెంగయ్య, వర్షాచలం రాజేష్ ,పవన్ యాదవ్,కరీం,శ్రీకాంత్ మోపూరి నందిని,నందిని,గజరాజు శాంతికళ,లత, తదితరులు కూడా కార్యక్రమంలో పాల్గొని అంబేద్కర్ గారికి నివాళులు అర్పించారు.