సర్వసభ్య సమావేశం 38 అంశాలు ఏకగ్రీవ తీర్మానం
* మున్సిపల్ చైర్మన్ మొలుగు ప్రశాంత్ కుమార్ దిలీప్ కమిషనర్ గుట్టల మల్లికార్జున స్వామి ఆధ్వర్యంలో
జమ్మికుంట జూలై 31 (ప్రజావాణి)
జమ్మికుంట మున్సిపల్ కార్యాలయంలో సాధారణ సర్వసభ్య సమావేశం జరిగినది మున్సిపల్ చైర్మన్ మొలుగు ప్రశాంత్ కుమార్ (దిలీప్) కమిషనర్ గుట్టల మల్లికార్జున స్వామి ఆధ్వర్యంలో కౌన్సిల్ మీటింగ్లో 38 అంశాలు చదివి వినిపించారు కార్యాలయంలో వెహికల్ రిపేరు శ్రీరామ హాస్పిటల్ నుండి హోటల్ నరసయ్య ఇంటి వరకు డ్రైనేజీ మరియు కల్వర్టు నిర్మాణం రానున్న వర్షాకాలం దృష్ట్యా నీటి నిలువ ఉన్న చోట ఆర్ సి సి పైపులు కొనుగోలు చేయడం లీకేజీ వాటర్ ను అరికట్టుట వాళ్ళు రిపేరు బ్లేడ్ ట్రాక్టర్ జెసిబి లాడర్ రిపేరు చేయుటకు మరియు రానున్న వినాయక చవితి వినాయక విగ్రహాలు నిమజ్జనం చేయుట క్రేన్లు కిరాయి తీసుకోవడం జనరేటర్ టైంటూ స్టేజ్ మరియు రోడ్లపై గుంతలు పూడ్చడం మున్సిపల్ కార్యాలయంలో సీసీ కెమెరాలు ఇంటర్ ఫోన్ కనెక్షన్స్, టీవీ ఏర్పాటు చేయుటకు మరియు గాంధీ చౌక్ జాతీయ జెండా పోల్ మరమ్మత్తులు చేసి జెండా ఆవిష్కరణ చేయడం గాను లక్ష రూపాయలు కౌన్సిల్ ఆమోదం మరియు వీధి దీపాల కొరకు పిసిబిఎస్ సెన్సార్లు డైవర్స్ ఎల్ఈడి లైట్లు వీధి దీపాల సామాను కొనుగోలు కొరకు 10 లక్షలు , డెవలప్మెంట్ మొక్కలు కొనుగోలు చేయడం కొరకు, డ్రైనేజీ నిర్మాణం మొత్తం 38 అంశాలు కౌన్సిల్ సభ్యులు అందరూ ఏకగ్రీవంగా ఆమోదించారు . సమావేశానికి వైస్ చైర్మన్ జావిద్ గారు మున్సిపల్ కౌన్సిలర్ మరియు మేనేజర్ జి రాజిరెడ్డి ,ఏఈ వికాస్ ,జే ఏ ఓ రాజశేఖర్ రెడ్డి, కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు
