prajavaani.net
Newspaper Banner
Date of Publish : 08 March 2026, 3:50 am Digital Edition : MADHUBABU ANDRAPRADESH

సర్నాల తిరుపతిరావు కు పార్టీ అధిష్టానం మరో కిలక పదవి కట్టబెట్టింది

ప్రజావాణి న్యూస్: (మార్చి 08)ఎన్టీఆర్ జిల్లా, మైలవరం .తూర్పు నియోజకవర్గ పరిశీలకుడు గా సర్నాల తిరుపతిరావు.ఉత్తర్వులు జారీ చేసిన వైసీపీ కేంద్ర కార్యాలయం. వైసీపీ నేత విజయవాడ పార్లమెంట్ పరిశీలకుడు గా కొనసాగుతున్న సర్నాల తిరుపతిరావు కు పార్టీ అధిష్టానం మరో కిలక పదవి కట్టబెట్టింది. ఇప్పటికే తర్వాత ఎన్టీఆర్ జిల్లా లో గురుతర బాధ్యతలు నిర్వర్తిస్తూ పార్టీ కార్యక్రమాల్లో కీలకంగా పని చేస్తున్న సర్నాల తిరుపతిరావు కు పార్టీ మరో బాధ్యత అప్పగించింది. 2024 ఎన్నికల్లో మైలవరం నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి గా పోటీ చేసిన సర్నాల తిరిపతి రావు ఓటమి తరువాత వైసీపీ లో కీలకంగా మారారు. జిల్లా లో అత్యంత కీలమైన విజయవాడ పార్లమెంట్ పరిశీలకుడు పదవి కట్టబెట్టిన వైసీపీ అధినాయకత్వం వచ్చే ఎన్నికల్లో ఆయనను పార్లమెంట్ అభ్యర్థిగా నిలబెడతారు అనే ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలో ఇప్పుడు మళ్ళీ విజయవాడ తూర్పు నియోజకవర్గ పరిశీలకుడు గా నియమించడం పార్టీ లో ఆయనకు దక్కిన ప్రాధాన్యత,గౌరవం ఉదాహరణ గా నిలుస్తుంది