ప్రజావాణి (మర్చి 14) కాశీనాయన మండల పరిధిలోని ఇటుకలపాడు రెవెన్యూ పొలంలో 458 నెంబర్లో 18. 40సెంట్లు వివాదాస్పదంగా ఉన్న భూమిలో పోలీసులు మరియు రెవెన్యూ అధికారుల అండదండతో ఇలాంటి ఉత్తర్వులు లేకుండా బోర్లు వేస్తున్న తాసిల్దారుకు తెలిసినా తెలియనట్లు ఉన్నాడని భూమి గల రైతులు వేణుగోపాల్ రెడ్డి పోలయ్య మరి కొంతమంది రైతు ఆరోపించారు భూమి హైకోర్టు పరిధిలో ఉన్న పోలీసు అధికారులకు రెవెన్యూ అధికారులకు తెలిసినా తాసిల్దార్ పర్మిషన్ ఇవ్వకుండానే బోర్లు వేశారు పర్మిషన్ లేని బోర్లు వేసేందుకు పోలీస్ సిబ్బంది అర్ధరాత్రి అక్కడ ప్రొటెక్షన్ ఉన్నట్లు సమాచారం? గంజికుంట సుబ్బరాజేశ్వరావు అనే వ్యక్తి తన అనుచరులతో దౌర్జన్యంగా బోర్లు వేయటం అధికారులను లోపరచుకొని ఈ ప్రాంత పేద ప్రజలను ఇబ్బంది పెడుతున్నారని వారన్నారు అతను వేసిన బోర్లు ఏ పర్మిషన్తో అర్ధరాత్రి వేశాడని తాసిల్దారును బాధితులు ప్రశ్నిస్తే పర్మిషన్ నేను ఇవ్వలేదని చెప్తారే తప్ప ఆ బోర్లు వేసిన వ్యక్తిపై చర్యలు తీసుకోవడంలో నిర్లక్ష్యం వహిస్తున్నాడని వారన్నారు అసలు భూ సమస్యలు పోలీస్ అధికారులకు ఎలాంటి సంబంధం ఉంది అని వారు ప్రశ్నిస్తున్నారు తాసిల్దార్ ఎవరి భూమి అనేది నిర్ధారణ చేస్తే తప్ప పోలీస్ అధికారులు ఇలాంటి సమస్యల్లో చొరవ తీసుకోకూడదని జీవోలు ఉన్నా కాసినాయన పోలీసులు మాత్రం భూ కబ్జాలకి అండగా ఉంటూ పేదలకు అన్యాయం చేస్తున్నారని వారన్నారు తాసిల్దార్ అర్ధరాత్రి సమయంలో అక్రమoగ వేసిన బోర్లను సీజ్ చేయకపోతే అన్ని ప్రజాసంఘాల ఆధ్వర్యంలో ఉద్యమం చేస్తూ చట్టపరమైన న్యాయస్థానికి వెళ్తామని వారు అన్నారు ఇక్కడ ఉన్నా తాసిల్దార్ వెంకటసుబ్బయ్య.భూ కబ్జాదారులకు ఎవరైతే రాజకీయ పలుకుబడి గల వారికి అండగా ఉంటూ వారు చెప్పిందే వేధంగా పాటిస్తూ పేదలకు పూర్తిగా అన్యాయం చేస్తున్నాడని వారు కోర్టు ఆధారాలు ఉన్నాయని భూ కబ్జాదారులు, భూమి చదును చేస్తుంటే మేము అక్కడికి వెళ్ళకున్నా అక్కడ గొడవ చేసినట్లు కాశి నాయన ఎస్సై కేసు నమోదు చేయడం బాధాకరమైన విషయం అన్నారు విచారణ చేయకుండా కేసు నమోదు చేయడం ఎంతవరకు సమంజసం అని వారు ప్రశ్నించారు