కడప నగర కమిటీ ఆధ్వర్యంలో సాంఘిక, సంక్షేమ హాస్టల్ సమస్యల పరిష్కారం కోరుతూ పోస్ట్ కార్డు ఉద్యమం శ్రీకారం చుట్టిన ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు జాల సుమంత్, వీరపోగు రవి.ప్రస్తుతం పెరిగిన ధరలు అనుకూలంగా మెస్ కాస్మోటిక్ చార్జీలు 3000 కు పెంచాలి.సంక్షేమ హాస్టల్స్ లో ఖాళీగా ఉన్న వార్డెన్ మరియు కుక్కు వాచ్మెన్ పోస్టులను భర్తీ చేయాలి.అద్దె భవనాల్లో నడుస్తున్న సంక్షేమ హాస్టల్స్ కు సొంతభవనాలు ఏర్పాటు చేయాలిప్రతి సంవత్సరం సంక్షేమ హాస్టల్లో అభివృద్ధి కోసం నిధులు కేటాయించి మరమత్తులు చేయించాలి మౌలిక వసతులు కల్పించాలి.అందులో భాగంగా కడప లోని సంక్షేమ హాస్టల్ విద్యార్థుల ద్వారా రాష్ట్ర ముఖ్య మంత్రి గారికి పోస్ట్ కార్డు లు పంపించడం జరిగింది. ఈ కార్యక్రమం లో ఎస్ఎఫ్ఐ నగర ఉపాధ్యక్షులు కార్తీక్, అఖిలేష్, శివ తదితరులు పాల్గొన్నారు