prajavaani.net
Newspaper Banner
Date of Publish : 04 July 2026, 9:00 am Digital Edition : GIRIBABU KONDHURG

షాబాద్ మండలం సీతారామపురం లో శ్రీ సీతా శ్రీరామచంద్ర మూర్తి దేవాలయం పునః నిర్మా

షాబాద్ మండలం సీతారామపురం లో శ్రీ సీతా శ్రీరామచంద్ర మూర్తి దేవాలయం పునః నిర్మాణం శంకుస్థాపనలో పాల్గొన్న శాసన మండలి ప్రభుత్వ చీఫ్ డాక్టర్ పట్నం మహేందర్ రెడ్డి గారు.
ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి భూమి పూజ కార్యక్రమంలో పాల్గొన్న మహేందర్ రెడ్డి. 400 ఏండ్ల చరిత్ర ఉన్న దేవాలయం పూర్వవైభవం, అభివృద్ధి కి ప్రభుత్వం పూర్తిగా సహకరిస్తుంది.
దేవాలయం పేరా 100 కోట్ల ఆస్తులు ఉన్నాయి. రూ. 3 కోట్ల తో ఆలయం గర్భ గుడి పునః నిర్మాణం పనులు చేస్తున్నారు. ఆలయం అభివృద్ధికి తన వంతుగా సహకరిస్తానని మహేందర్ రెడ్డి అన్నారు.
సర్పంచ్ పావని చెన్నయ్య మాజీ సర్పంచులు పాండు రంగారెడ్డి, సురేష్ గౌడ్, మాజీ ఉపసర్పంచ్ సందీప్, గ్రామ పెద్దలు డాక్టర్ రాజు, శ్రీనివాస్ రెడ్డి, వెంకట్ రెడ్డి, నర్సింలు, మంగలి రాజు, తదితరులు ఆయనతో ఉన్నారు.