prajavaani.net
Newspaper Banner
Date of Publish : 02 March 2026, 3:31 pm Digital Edition : MADHUBABU ANDRAPRADESH

శ్రీమతి పద్మావతమ్మ గుండెపోటుతో మృతి

బద్వేల్ పట్టణంలోని విష్ణు ప్రియ టెక్స్ టోరియం అధినేతలు, అడ్వకేట్ పత్తి నాగేంద్రప్రసాద్, సురేష్ బాబు మరియు మధుసూదన్ గారి మాతృమూర్తి శ్రీమతి పద్మావతమ్మ గారు గుండెపోటుతో మృతి చెందడం పట్ల బద్వేల్ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ శ్రీ కే రితేష్ రెడ్డి గారు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.ఈ బాధాకరమైన వార్త విన్న వెంటనే రితేష్ రెడ్డి గారు ఈరోజు సాయంత్రం వాసవిఅపార్ట్‌మెంట్‌లోని వారి స్వగృహానికి చేరుకుని, పద్మావతమ్మ గారి చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం వారి కుటుంబ సభ్యులను ఓదార్చి, తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. మంచితనానికి మారుపేరుగా నిలిచిన పద్మావతమ్మ గారి మరణం ఆ కుటుంబానికి తీరని లోటు అని, ఆమె ఆత్మకు శాంతి కలగాలని ఈ సందర్భంగా వారు ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో టీడీపి జిల్లా వాణిజ్య విభాగం జనరల్ సెక్రటరీ కనమర్ల పూటీ ప్రసాద్, కె.వి. సుబ్బారావు, పి.వి.ఎన్ ప్రసాద్, తులసి వెంకట శివ నారాయణ, సి.వి. నాగేశ్వరరావు, జొన్నలగడ్డ సుధాకర్, తుమ్మలపెంట సురేష్ బాబు, నరసింహనాయుడు, మహేశ్వర్ రెడ్డి, వ్యవసాయ మార్కెట్ యార్డ్ డైరెక్టర్ కొలిశెట్టి నాగరాజ, కొప్పర్తి రాదయ్య, దొంతంశెట్టి కిషోర్ కుమార్, కరెంటు నరసారెడ్డి, రామ్మూర్తి నాయుడు, సింగంపల్లి శివయ్య స్వామి, చింతకుంట కృష్ణమూర్తి, లకిడి విజయభాస్కర్, వెంకటసుబ్బయ్య, చిన్ని బసవయ్య, ముచ్చర్ల సుధాకరరావు, అబ్బిరెడ్డి రామసుబ్బయ్య, వల్లకొండు సత్యనారాయణ, చెవుల కృష్ణమూర్తి గారులతో పాటు పలువురు టీడీపీ నాయకులు మరియు అపార్ట్‌మెంట్ వాసులు పాల్గొన్నారు.