బెజ్జంకి,ఏప్రిల్ 20(ప్రజావాణి)
సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండల కేంద్రంలో శివ భక్త మార్కండేయ పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో మజ్జిగ వితరణ కార్యక్రమం నిర్వహించారు. సుమారు 500 మంది సభ్యులకు వేసవి వేడిని దృష్టిలో ఉంచుకుని మజ్జిగను పంపిణీ చేశారు.ఈ కార్యక్రమాన్ని బెజ్జంకి గ్రామ సర్పంచ్ పొలం శ్రీధర్ హాజరై ప్రారంభించారు. కార్యక్రమంలో పాల్గొన్న సభ్యులు, స్థానిక ప్రజలు ఈ సేవా కార్యక్రమాన్ని అభినందించారు.