వ్యవసాయ మార్కెట్ సాధారణ సమావేశంలో పాల్గొన్న మున్సిపల్ చైర్మన్ మొలుగు ప్రశాంత్ కుమార్ (దిలీప్)

ఘనంగా సన్మానించిన వ్యవసాయ మార్కెట్ చైర్మన్ పల్లూరి స్వప్న సదానందంవైస్ చైర్మన్ సతీష్ రెడ్డి
జమ్మికుంట మార్చి 12 (ప్రజావాణి)
తెలంగాణ రాష్ట్రంలో అతిపెద్ద మార్కెట్ గా పేరుగాంచిన జమ్మికుంట వ్యవసాయ మార్కెట్ లో మొదటి సారిగా జరిగే సాధారణ సమావేశంలో పాల్గొన్న మున్సిపల్ చైర్మన్ మొలుగు ప్రశాంత్ కుమార్ (దిలీప్) ని ఘనంగా సన్మానించిన వ్యవసాయ మార్కెట్ చైర్మన్ పల్లూరి స్వప్న సదానందంవైస్ చైర్మన్ సతీష్ రెడ్డి ఈ కార్యక్రమంలో పాల్గొన్న మున్సిపల్ చైర్మన్ మొలుగు ప్రశాంత్ కుమార్ (దిలీప్) మాట్లాడుతూ జమ్మికుంట వ్యవసాయ మార్కెట్ కు తెలంగాణ రాష్ట్రంలోనే ఎంతో మంచి పేరు ఉంది కాబట్టి మన కమిటీ కూడా అదేవిధంగా ఉండి రైతులకు అన్నివిధాలుగా అందుబాటులో ఉండి రైతులకు అండగా ఉండాలని తెలిపారు ఈ కార్యక్రమంలో డైరెక్టర్స్ తదితరులు పాల్గొన్నారు.