వీధిలైట్లు లేక అల్లాడుతున్న దళితులు.
మన ప్రజావాణి. మంథని ప్రతినిధి. మంథని మండలం చిల్లపల్లి గ్రామంలో దళితవాడకు వీధిలైట్లు లేక దళితులు పది రోజుల నుండి అల్లాడుతున్నారని అన్నారు చీకట్లో బయటికి వెళ్లాలంటే చాలా భయమేస్తుంది అన్నారు పది రోజులక్రితం రోడ్ పక్కకు ఉన్న చెట్లు కొట్టారు అప్పుడు కరెంటు తీగలు తెగిపోయాయి అప్పటినుండి కరెంటు లేక ఉపసర్పంచ్ కంచు రాణిని దళితులు అడగగా చేపిస్తామని అన్నారు తప్ప ఇంతవరకు చేపించలేదని అంటున్నారు కేవలం మేము దళితులమైనందుకే మా సమస్యను పట్టించుకోవడం లేదని వేరే ఇంకెవరైనా ఎప్పుడో చేపించేవారని అన్నారు
ఈ విషయం గురించి ఏ ఈ ని వివరణ అడగగా నాకు కరెంటు లేదని తెలుసు పది రోజుల నుండి అని తెలియదు అన్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి దళిత వాళ్ళ సమస్యను పరిష్కరించాలని అంటున్నారు