జగిత్యాల జిల్లా ఎండపల్లి మండలం కొండాపూర్ గ్రామంలో తన అభిమాని సింగతి రాజలింగయ్య కుమారుని వివాహ మహోత్సవానికి మద్దుల గోపాల్ రెడ్డి (ఎంజీఆర్) ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కల్యాణ వేదికపై నూతన వధూవరులను అక్షింతలు వేసి, నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో, సిరిసంపదలతో వర్ధిల్లాలని ఆశీర్వదించారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మండల అధ్యక్షుడు గెల్లు చంద్రశేఖర్ యాదవ్, ప్రధాన కార్యదర్శి కందికట్ల రాజేష్, నాయకులు గాజుల విజయ్, అంజి, గెల్లు శ్రీనివాస్, స్థానిక కాంగ్రెస్ శ్రేణులు పాల్గొని నూతన దంపతులను దీవించారు.