ఘట్కేసర్, జూలై 19: పౌరుల భద్రతతో పాటు ప్రమాదాల నివారణ లక్ష్యంగా చెట్ల కొమ్మల కత్తిరింపు, విద్యుత్ లైన్ల నిర్వహణ పనులు చేపట్టనున్న నేపథ్యంలో సోమవారం (20 జూలై) పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా తాత్కాలికంగా నిలిపివేయనున్నట్లు నారపల్లి విద్యుత్ శాఖ సహాయ ఇంజనీర్ హరినాథ్ సాగ్గు తెలిపారు.
మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు సదాశివనగర్, శివాజీనగర్, ఓయూ కాలనీ, వెంకటాద్రి టౌన్షిప్, ఏకశిలా నగర్, లక్ష్మీనగర్, సుప్రభాత్ ఫేజ్-1, చౌదరిగూడ తదితర ప్రాంతాల్లో,
సాయంత్రం 4 గంటల నుంచి 5.30 గంటల వరకు విహారిక కాలనీ రోడ్డు నంబర్లు 1 నుంచి 5 వరకు, కాకతీయ కాలనీ, ధరణి కాలనీ, సూర్యోదయ కాలనీ, పంచవటి కాలనీ రోడ్డు నంబర్లు 2, 3, సాయిహిల్స్ కాలనీ, పీజీ కాలనీ తదితర ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా అంతరాయం ఏర్పడనుంది.
విద్యుత్ సరఫరా నిలిపివేత సమయంలో వినియోగదారులు అవసరమైన జాగ్రత్తలు తీసుకొని విద్యుత్ శాఖకు సహకరించాలని అధికారులు కోరారు.