prajavaani.net
Newspaper Banner
Date of Publish : 02 August 2026, 12:02 pm Digital Edition : PRAJA VANI

విద్యుత్ షాక్‌తో రైతు ఎద్దు మృతి

విద్యుత్ షాక్‌తో రైతు ఎద్దు మృతి

మన సమగ్ర వాణి ఆగస్టు 02 అల్మాయిపేట్ సంగారెడ్డి జిల్లా ప్రతినిధి

సంగారెడ్డి జిల్లా, ఆందోల్ మండలం అల్మాయిపేట్ గ్రామంలో విషాద ఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన రైతు నాగేష్కు చెందిన ఎద్దు మేత కోసం వెళ్లిన సమయంలో విద్యుత్ షాక్‌కు గురై అక్కడికక్కడే మృతి చెందింది.
ఈ ఘటనతో రైతు నాగేష్ తీవ్ర ఆవేదనకు గురయ్యాడు. స్థానికులు సంఘటన స్థలానికి చేరుకుని విద్యుత్ శాఖ అధికారులు స్పందించి ఘటనపై విచారణ చేపట్టి, బాధిత రైతుకు తగిన నష్టపరిహారం అందించాలని కోరారు. గ్రామంలో ఈ ఘటన విషాదాన్ని నింపింది.