విద్యుత్ షాక్కు గురై వ్యక్తి దుర్మరణం
విద్యుత్ షాక్కు గురై వ్యక్తి దుర్మరణంప్రజావాణి ప్రతినిధి, బీర్కూరు మండలం: బీర్కూరు మండలం బైరాపూర్ గ్రామంలో గురువారం విషాద ఘటన చోటుచేసుకుంది.స్థానికుల కథనం ప్రకారం, గ్రామానికి చెందిన నెమ్ల్లీ శ్రీనివాస్ గౌడ్ (42) తన పొలం వద్ద ఉన్న విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ సమీపంలో పని చేస్తుండగా ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్కు గురయ్యారు. తీవ్ర గాయాల కారణంగా ఆయన అక్కడికక్కడే మృతి చెందారు.ఈ ఘటనతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. మృతుడి కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు.సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని పంచనామా నిర్వహించారు....