*చిలుకూరు మే 15(ప్రజావాణి*): గ్రంధాలయాలు విజ్ఞాన కేంద్రాలని చిలుకూరు మండల ఎంఈవో గుజ్జుల నరసింహారెడ్డి, సర్పంచ్ కొల్లు పుల్లమ్మ నాగయ్య అన్నారు. శుక్రవారం చిలుకూరు బాపూజీ శాఖా గ్రంధాలయంలో విద్యావారోత్సవాలలో భాగంగా పుస్తక ప్రదర్శన కార్యక్రమంను నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రంధాలయాల్లో ఉన్న ‘పుస్తకాలను విద్యార్థులు ఉపయోగించుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రంథాలయ అధికారి సరవయ్య , ఉపాధ్యాయులు కోదండ రామయ్య ,కైలాసపు వెంకటేశ్వర్లు, షేక్ జానిమియా,డాక్టర్ సజ్జనకుమారి, గ్రామ పెద్దలు పిల్లుట్ల కృష్ణయ్య,బోయిళ్ళ శివ తదితరులు పాల్గొన్నారు.