prajavaani.net
Newspaper Banner
Date of Publish : 10 March 2026, 5:37 pm Digital Edition : VIJAYKUMAR SIDDIPET

విద్యార్థులే ఉపాధ్యాయులైనవేల:జగదేవపూర్ పాఠశాలలో ఘనంగా స్వయం పరిపాలన దినోత్సవం..

 

సిద్దిపేట జిల్లా, జగదేవపూర్, మార్చి 10, ప్రజావాణి

జగదేవపూర్ ఎంపీపీ ఎస్ పాఠశాలలో విద్యార్థిని విద్యార్థులందరు మంగళవారం రోజు స్వయం పరిపాలన దినోత్సవాన్ని ఘనంగాజరుపుకున్నారు.స్వయం పరిపాలనదినోత్సవంలో సమీరాప్రధానోపాధ్యాయులుగా వ్యవహరించగా,తమన్ జిల్లా కలెక్టర్ గా,కె.గౌతమ్ డీఈవో గా,జబేర్ ఎంఈఓగా వ్యవహారించారు.ఈ సందర్బంగా విద్యార్థులు పాత్రలలో ఉత్తమ ప్రతిభ కనబరిచి వారిలో ఉన్నటువంటి నైపుణ్యాన్ని నిరూపించుకున్నారు.ఈ కార్య క్రమానికి ముఖ్య అతిథిగా ఎంఈఓ సైదులు హాజరయ్యారు.ఈ కార్యక్రమంలోప్రధానోపాధ్యాయులు శ్యాంసుందర్ రావు,ఉపాధ్యాయులు షకీరా బేగం,పృద్వి,రాజేశ్వరి,సునీత,ఐఇఆర్పి కరుణాకర్,ప్రీ ప్రైమరీ ఉపాధ్యాయులు సరస్వతి,మౌనిక,ఏఏపీసి చైర్మన్ శివలక్ష్మి తదితరులు పాల్గొన్నారు..