prajavaani.net
Newspaper Banner
Date of Publish : 20 April 2026, 4:25 pm Digital Edition : MADHUBABU ANDRAPRADESH

వాసవి క్లబ్ ఆధ్వర్యంలో కొత్తగా చేరిన 162 మంది నూతన వనిత సభ్యులకు.చీరలతో పాటు 162 మంది వనితలందరికీ వడి బియ్యం కార్యక్రమం

కడప జిల్లా ప్రజావాణి న్యూస్ (ఏప్రిల్20) మైదుకూరు వాసవి క్లబ్ & వనిత క్లబ్ మైదుకూరు వారి ఆధ్వర్యంలో కొత్తగా చేరిన 162 మంది నూతన వనిత సభ్యులకు,ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ శ్రీ సిద్ధ సూర్యప్రకాష్ రావు బహుమతిగా ఇచ్చినటువంటి చీరలతో పాటు.162 మంది వనితలందరికీ వడి బియ్యం కార్యక్రమం అంగరంగ వైభవంగా శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానం మైదుకూరు నందు జరిగినది.ఈ వడి బియ్యం కార్యక్రమమునకు వాసవి క్లబ్ అధ్యక్షులు సందిపూటీ సతీష్ ధర్మపత్ని అన్నపూర్ణ మరియు సంధిపుటి శ్రీనివాసులు ధర్మపత్ని సుకన్య, సహాయ సహకారంతో జరిగినది ఈ వడి బియ్యం కార్యక్రమం వాసవి క్లబ్ మైదుకూరు ప్రెసిడెంట్ సందిపూటి సతీష్ కుమార్. మరియు వనిత అధ్యక్షురాలు లేపూరి లక్ష్మీదేవి ఆధ్వర్యంలో ఆర్యవైశ్య సభ మైదుకూరు వారి సహకారంతో జరిగింది ఈ కార్యక్రమంనకు ఆర్యవైశ్య సభ అధ్యక్షులు బల్లాన్ని చెన్నకేశవులు,మరియు ఆర్యవైశ్య సభ ప్రతినిధులు;వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ అధికారులు శ్రీ దొంతు సుబ్రమణ్యం,ముచ్చర్ల రాధాకృష్ణమూర్తి,గవర్నర్ అనుముల వేణుగోపాల శెట్టి, క్యాబినెట్ సెక్రటరీ పబ్బతి గోపాల్,ఇంటర్నేషనల్ ప్రోగ్రాం కోఆర్డినేటర్ సూరే సుబ్బరాజు, వాసవి కుటుంబ సురక్ష పథకం ఇన్చార్జి ఇమ్మడిశెట్టి సతీష్ బాబు,రీజియన్ చైర్ పర్సన్ వంకధార రవి ప్రసాద్,ఆర్యవైశ్య యువజన సంఘం అధ్యక్షులు పుట్టా సాయి మహిళా మండలి అధ్యక్షులు బళ్లాని సునంద జోన్ చైర్ పర్సన్ కనుమల పూటి జ్యోతి,ఆర్యవైశ్య సభ కోశాధికారి దరిశా శ్రీనివాసులు ఆర్యవైశ్య జిల్లా వర్కింగ్ కమిటీ ప్రెసిడెంట్ యెలిశెట్టి ప్రసాద్ మరియు ఇతర అధికారులు హాజరై జయప్రదం చేశారు