prajavaani.net
Newspaper Banner
Date of Publish : 08 June 2026, 9:11 am Digital Edition : MADHUBABU ANDRAPRADESH

వార్డు నెంబర్ 8 లో నిలుస్తున్న మురుగునీరు,రోగాల బారిన పడుతున్న స్థానికులు

వార్డు నెంబర్ 8 లో మురుగునీటి అవస్థలు:

రోడ్లపైనే ప్రవహిస్తున్న వైనంఅస్తవ్యస్తంగా మారిన రహదారులు:

పట్టించుకోని అధికారులుకాలువల మరమ్మతులు కరవు:

పోరుమామిళ్ల జూన్7ప్రజావాణి పట్టణంలోని వార్డు నెంబర్ 8 లో అంబేద్కర్ భవన్ వెనుక వైపు ఉన్న నివాస ప్రాంత వీధి అధ్వాన్నంగా మారింది.డ్రైనేజీ వ్యవస్థ సరిగా లేకపోవడంతో మురికి నీరు రోడ్డుపైనే ప్రవహిస్తూ నిలిచిపోతోంది.దీనివల్ల స్థానిక ప్రజలు,నడిచే బాటసారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.ప్రధాన సమస్యలు రహదారిపై మురుగునీరు: ఇళ్ల నుంచి వచ్చే మురికి నీరు వెళ్లేందుకు సరైన కాలువలు లేకపోవడంతో,ఆ నీరంతా సిమెంట్ రోడ్డుపైనే చెరువులా మారుతోంది.దోమల వ్యాప్తి – దుర్వాసన నిలిచిపోయిన మురుగు నీటి వల్ల ఆ ప్రాంతమంతా తీవ్రమైన దుర్వాసన వస్తోంది.దోమలు, ఈగలు విపరీతంగా పెరిగిపోయి అంటువ్యాధులు ప్రబలే ప్రమాదం ఉందని స్థానికులు ఆందోళన చెందుతున్నారు.ప్రమాదకరంగా మారిన ప్రయాణం రోడ్డుపై మురుగు నీరు నిలవడం వల్ల నాచు పేరుకుపోయి ద్విచక్ర వాహనదారులు,ముఖ్యంగా వృద్ధులు,పిల్లలు నడిచేటప్పుడు జారిపడే అవకాశం ఉంది.స్థానికుల డిమాండ్ఈ సమస్యపై సంబంధిత అధికారులు తక్షణమే స్పందించాలని స్థానికులు కోరుతున్నారు.ఇక్కడ శాశ్వత డ్రైనేజీ కాలువలను నిర్మించి,రోడ్డుపై నిలిచిన మురికి నీటిని తొలగించి, బ్లీచింగ్ పౌడర్ చల్లాలని, తద్వారా తమకు ఆరోగ్య సమస్యలు రాకుండా చూడాలని విజ్ఞప్తి చేస్తున్నారు.