మర్కుక్, మార్చి 26, ప్రజావాణి
మర్కుక్ లో రైన్ ఫెడ్ ఏరియా డెవలప్మెంట్ పథకం కింద రైతులకి శిక్షణ కార్యక్రమం నిర్వహించడం జరిగింది .ఈ కార్యక్రమంలో వర్మీ కంపోస్టు తేనెటీగల పెంపకం ఆగ్రో ఫారెస్ట్రీ పంటలపై అవగాహన కల్పించడం జరిగింది. రైతులు ఈ కార్యక్రమం పై సంతృప్తి వ్యక్తం చేస్తూ సూచించిన పద్ధతులు అమలు చేయడానికి ఆసక్తి చూపించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా ఉద్యానవనాధికారి ని సువర్ణ, శాస్త్రవేత్త శైలజ, హార్టికల్చర్ ఆఫీసర్ సౌమ్య, మండల వ్యవసాయ అధికారి రాము, ఉద్యానవన విస్తరణ అధికారి అరవింద, విజయ్, వ్యవసాయ విస్తరణాధికారి విష్ణువర్ధన్ యాదవ రెడ్డి ,మల్లారెడ్డి ,బాబు, శ్రీకాంత్, రైతులు రైతులు పాల్గొన్నారు.