prajavaani.net
Newspaper Banner
Date of Publish : 07 April 2026, 10:05 am Digital Edition : VIJAYKUMAR SIDDIPET

వర్గల్ గ్రామానికి చెందిన జగదాంబ మృతి..

సిద్దిపేట్, వర్గల్ ఏప్రిల్ 7, ప్రజావాణి

సిద్దిపేట జిల్లా వర్గల్ మండల్ వర్గల్ గ్రామానికి చెందిన జగదాంబ (85) మంగళవారం ఉదయం సుమారు 5 గంటల సమయంలో మృతి చెందారు. వృద్ధాప్యంతో పాటు కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె, చివరికి కన్నుమూసినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.జగదాంబ, గ్రామంలో మంచితనంతో, పేరు పొందారు. ఆమె మరణవార్త గ్రామంలో విషాదాన్ని నింపింది. కుటుంబ సభ్యులు, బంధువులు, గ్రామస్థులు పెద్ద సంఖ్యలో తరలి వచ్చి ఆమెకు చివరి వీడ్కోలు పలికారు.ఆమెకు నలుగురు కుమారులు, ఉన్నారు. అంత్యక్రియలు మంగళవారం మధ్యాహ్నం గ్రామంలో నిర్వహించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు..